3, ఏప్రిల్ 2010, శనివారం

చిట్టి కథ ...

మనకు ఎంత డబ్బు ఉన్నా చాలదు... ఇంకా కావాలి అనిపిస్తుంది అది మానవ నైజం ...
ఒకరోజు రాజు అనే అతని మావగారు చనిపోతారు... వాళ్ళ మిత్రుడు ఒకడు పరామర్శకు వస్తాడు అన్న మాట...
పాపం వచ్చిన వాడు .. బాధ పడకు ఇదీ అదీ అని.. చాలా ఊరడిస్తాడు
అప్పుడు రాజు అంటాడు...
"ఒరేయ్ మొన్న మా వేరే మావయ్య చనిపోయాడు .. నా పేరు మీద పది లక్షల ఆస్తి రాసి... అని ఏడుస్తాడు...."
ఒక నిమిషం ఆగి..
"మూడు రోజుల ముందు మా మావయ్య అన్నయ చనిపోయాడు అయన కుడా నా పేరు మీద ఇరవయ్యి లక్షలు రాశాడురా..." అనీ చెప్పి మళ్లి ఏడుపు....
మిత్రుడు మాట్లాడే లోపే మళ్లి అందుకుని
"ఇప్పుడు ఈయన మరో కోటి రాసాడు.......!!!!"
అపుడు మిత్రుడు అంటాడు... "ఒరేయ్ నువ్వు ఒకరకంగా బాధ పడాల్సిన అవసరం లేదురా.. ఎందుకంటే.. నీకు అదృష్తం తన్నుకుని వచ్చింది......!!!!"
"నిజమేరా "అంటాడు రాజు..
మరి ఇంకా ఎందుకు ఇంత ఏడుపు.....
" ఒరేయ్ నాకు ఇంకా మావయ్యలు ఎవరూ లేరురా..................!!!!!!!"
అసలు సంగతి మళ్లి ఏడుస్తూ చెప్తాడు రాజు.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి